అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేష్
- November 24, 2017
అమరావతి: 2022 నాటికి అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో మూడు ఐటీ క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి ఆటోనగర్లో అక్షర ఎంటర్ప్రైజెస్, కేజే సిస్టమ్ ఐటీ సంస్థలకు మంత్రి లోకేశ్ ఇవాళ భూమి పూజ చేశారు. ఒక్క మంగళగిరి ఐటీ క్లస్టర్లోనే 10వేల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. గన్నవరంలోని మేధాటవర్స్ నిర్మాణం 2010లోనే పూర్తయినప్పటికీ .. అప్పటి ప్రభుత్వం ఒక్క ఐటీ సంస్థను కూడా తీసుకురాలేకపోయిందన్నారు. తాము వచ్చిన తర్వాత మేధాటవర్స్ నిండిపోయి రెండో దశకు శంకుస్థాపన చేశామన్నారు. చిన్న ఐటీ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని, అనుమతులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. తాను కేవలం ఆరు గంటల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నానని.. పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావాలని లోకేశ్ కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









