అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేష్
- November 24, 2017
అమరావతి: 2022 నాటికి అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో మూడు ఐటీ క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి ఆటోనగర్లో అక్షర ఎంటర్ప్రైజెస్, కేజే సిస్టమ్ ఐటీ సంస్థలకు మంత్రి లోకేశ్ ఇవాళ భూమి పూజ చేశారు. ఒక్క మంగళగిరి ఐటీ క్లస్టర్లోనే 10వేల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. గన్నవరంలోని మేధాటవర్స్ నిర్మాణం 2010లోనే పూర్తయినప్పటికీ .. అప్పటి ప్రభుత్వం ఒక్క ఐటీ సంస్థను కూడా తీసుకురాలేకపోయిందన్నారు. తాము వచ్చిన తర్వాత మేధాటవర్స్ నిండిపోయి రెండో దశకు శంకుస్థాపన చేశామన్నారు. చిన్న ఐటీ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని, అనుమతులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. తాను కేవలం ఆరు గంటల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నానని.. పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావాలని లోకేశ్ కోరారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







