ప్రభుత్వ కార్యాలయాల్లో జిమ్లు ఏర్పాటు: చంద్రబాబు
- November 24, 2017
విజయవాడ: నగరంలో ఆర్అండ్బీ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.101 కోట్లతో 12 నెలల్లో పర్యావరణహితంగా భవన నిర్మాణం చేపట్టారని, భవనంపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా 30 శాతం విద్యుత్ ఆదా కానుందని సీఎం అన్నారు. భవనంలో ఏపీపీఎస్సీ, ఐటీ, ఆర్అండ్బీ శాఖలు పనిచేయనున్నాయన్నారు.
రహదారులు బాగుంటే అభివృద్ధి అదే జరుగుతుందని ఆయన చెప్పారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై ఆలోచిస్తున్నామని, జిల్లాల్లో అన్ని శాఖలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తిస్థాయి రావాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో జిమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించబోమని సీఎం వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







