ప్రభుత్వ కార్యాలయాల్లో జిమ్లు ఏర్పాటు: చంద్రబాబు
- November 24, 2017
విజయవాడ: నగరంలో ఆర్అండ్బీ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.101 కోట్లతో 12 నెలల్లో పర్యావరణహితంగా భవన నిర్మాణం చేపట్టారని, భవనంపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా 30 శాతం విద్యుత్ ఆదా కానుందని సీఎం అన్నారు. భవనంలో ఏపీపీఎస్సీ, ఐటీ, ఆర్అండ్బీ శాఖలు పనిచేయనున్నాయన్నారు.
రహదారులు బాగుంటే అభివృద్ధి అదే జరుగుతుందని ఆయన చెప్పారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై ఆలోచిస్తున్నామని, జిల్లాల్లో అన్ని శాఖలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తిస్థాయి రావాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో జిమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించబోమని సీఎం వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







