క్షిపణుల సామర్ధ్యం పెంచుతాం : ఇరాన్‌

- November 26, 2017 , by Maagulf
క్షిపణుల సామర్ధ్యం పెంచుతాం : ఇరాన్‌

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ బెదిరింపులకు లోను చేస్తే తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్ల వరకు పెంచుతామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జి)కి నేతృత్వం వహిస్తున్న బ్రిగేడియర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామి తెలిపినట్లు స్థానిక వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమం గురించి చర్చలు జరిపేందుకు ఇరాన్‌కు ఫ్రాన్స్‌ పిలుపునిచ్చింది. దీంతోపాటు 2015లో అణుసమస్యపై ప్రధాన దేశాలతో ఇరాన్‌ చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగే అంశాన్ని కూడా చర్చించే అవకాశముంది. తన క్షిపణి కార్యక్రమం రక్షణ కోసం చేస్తున్నదేనని, దానిపై చర్చించాల్సిన అవసరం లేదని ఇరాన్‌ పదేపదే తెలిపింది. తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్లకు మించి పెంచకపోవడానికి సాంకేతిక లోపం కారణం కాదని, తాము ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తున్నందువల్లే అలా చేయలేదని హొస్సేన్‌ సలామి తెలిపారని ఆ వార్త సంస్థ తెలిపింది. యూరప్‌ నుంచి ముప్పు ఉండదని ఇప్పటి వరకు తాము భావించామని, అందవల్ల క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచలేదని, యూరప్‌ ముప్పు తలపెట్టాలని భావిస్తే, క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచుతామని ఆయన హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com