హెయిల్ కు చేరుకొన్న మొదటి సౌదీ రైల్వే కంపెనీ రైలు
- November 29, 2017జెడ్డా: మొదటి సౌదీ రైల్వే కంపెనీ రైలు శనివారం హెయిల్ లో ప్రవేశించింది. అల్-మజ్మాహ్ మరియు ఖాసీమ్ గుండా ప్రయాణించిన ఈ రైలు రియాద్ నుండి నాలుగవ స్టాప్ గా హెయిల్ ఉంది. అర్ధ జానపద నృత్యాన్ని సంతోషంగా చేయడం ద్వారా ఈ రైలును స్థానికులు ఘనంగా స్వాగతించారు. ఈ రైలు సేవతో రాజధాని రియాద్ కు కలుపబడే ఒక సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఎంపికను హెయిల్ నివాసులను అందిస్తుంది. సౌదీ అరేబియా రైల్వే సేవ ,నిర్వహణ స్థానాల్లో ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. రియాద్ నుండి హేయిల్ వరకు ప్రయాణం చేయటానికి ప్రారంభ టికెట్ 120 సౌదీ రియల్ (32 డాలర్లు) ధరలు ఉంటాయి,అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లయితే ప్రయాణికుడు 60 సౌదీ రియళ్ల రాయితీని పొందవచ్చు. ప్రయాణికులు ఆదివారాలు, బుధవారాలు ,శుక్రవారాలలో రియాద్-హేల్ రైలులో ప్రయాణించవచ్చు .ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పలువురు వివిధ సోషల్ మీడియా వేదికలపై సౌదీ రైల్వే కంపెనీ రైలు గూర్చి సానుకూలంగా స్పందిస్తూ, సొగసైన కాబిన్ డిజైన్ , మృదువైన నిర్వహణ పట్ల ప్రశంసించారు. రెడ హన్వార్ అనే మహిళ రైలులో తన అనుభవాన్ని ఒక ట్వీట్లో పేర్కొంటూ, " తాను ఒక కలలోకి అడుగుపెట్టిన అనుభూతి ఉందని ఈ ప్రయాణినికి అంతమే లేదని భవిష్యత్తు మహా అనంతమైనదని ఆమె పేర్కొంది. "
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం