కువైట్ లో గత 11 నెలల్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 370 మంది మృతి
- December 03, 2017
కువైట్ : అధికారిక గణాంకాల సూచన ప్రకారం ఈ సంవత్సరం ' రోడ్ రేజ్ ' ఫలితంగా మొదటి 11 నెలలలో ప్రమాదకరమైన పెరుగుదల ఉందని తెలియ చేస్తోంది . జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ (జిటిడి) విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం ఆ నిర్దేశ కాలంలో 80,000 విభిన్న సంఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. వీటి ఫలితంగా 370 మంది కువైట్ వాసులు మరియు ప్రవాసీయులు అకాల మరణం చెందారు.ఈ కాలంలో 10 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాలలో గాయపడినట్లు నివేదికలు ద్వారా వెల్లడైంది.130 మంది ప్రవాసీయులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో వారిని దేశం నుంచి బహిష్కరించారు. 22,000 వాహనాలను వివిధ కారణాలతో స్వాధీనం చేసుకొని అక్కడనుంచి తరలించారు మరియు 1,930 మంది నిర్లక్ష్య వాహనదారులను అధికారులకు వారిని సూచించారు. ఈ కాలంలో 1,450 మిలియన్ ప్రత్యక్ష మరియు పరోక్ష ఉల్లంఘన నమోదు చేయబడ్డాయి. ఈ కాలంలోనే ఎటువంటి గాయాలకు గురికాకుండా 68,000 మంది ప్రమాదాలకు కారణమయ్యారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడినవారి సంఖ్య 10,000 మంది కాగా 2,279 వాహనాలు విపరీతమైన మలుపులు తిరుగుతూ ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు వారిలో అత్యంత నిర్లక్ష్యంతో వాహనాలు నడిపే 136 మందిని అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







