భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
- December 04, 2017
53 ఏళ్ళ వ్యక్తి ఒకరు కింగ్ ఫైసల్ రోడ్లోని ఓ భవనం 10వ అంతస్తు నుంచి కింత పడి మృతి చెందిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఉదయం 9.30 నిమిషాల సమయంలో ఘటన గురించిన సమాచారం అందుకోవడం జరిగింది. ఆపరేషన్ రూమ్కి సమాచారం అందగానే, పెట్రోల్స్ మరియు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో కూడిన టీమ్స్ రంగంలోకి దిగాయి. అయితే సంఘటనా స్థలంలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. జరిగింది హత్యా? ఆత్మహత్యా? అనేది విచారణలో తేలుతుందని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ సహా పలు సాక్ష్యాల్ని సేకరించారు పోలీసులు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి