భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
- December 04, 2017
53 ఏళ్ళ వ్యక్తి ఒకరు కింగ్ ఫైసల్ రోడ్లోని ఓ భవనం 10వ అంతస్తు నుంచి కింత పడి మృతి చెందిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఉదయం 9.30 నిమిషాల సమయంలో ఘటన గురించిన సమాచారం అందుకోవడం జరిగింది. ఆపరేషన్ రూమ్కి సమాచారం అందగానే, పెట్రోల్స్ మరియు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో కూడిన టీమ్స్ రంగంలోకి దిగాయి. అయితే సంఘటనా స్థలంలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. జరిగింది హత్యా? ఆత్మహత్యా? అనేది విచారణలో తేలుతుందని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ సహా పలు సాక్ష్యాల్ని సేకరించారు పోలీసులు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







