హత్య కు గురైన యెమెన్ మాజీ అధ్యక్షుడు
- December 04, 2017
సనా: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్(75)ను హతమార్చినట్లు హుతి తిరుగుబాటుదారులు ప్రకటించారు. దేశంలో నెలకొన్న సంక్షోభం ముగిసిందనీ.. సలేహ్, ఆయన మద్దతుదారుల్ని హతమార్చినట్లు తిరుగుబాటుదారుల అధీనంలోని అల్–మసీరా చానెల్ పేర్కొంది. మరోవైపు తిరుగుబాటుదారులు తీవ్రగాయాలతో ఉన్న సలేహ్ మృతదేహాన్ని ట్రక్కులో చేరుస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో కన్పిస్తోంది.
3 దశాబ్దాల పాటు యెమెన్ను పాలించిన సలేహ్ అరబ్ విప్లవం నేపథ్యంలో 2012లో ఉద్వాసనకు గురయ్యారు. అనంతరం యెమెన్ అధ్యక్షుడైన మన్సూర్ హదీకి వ్యతిరేకంగా హుతి తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. దీంతో దేశంలో అంతర్యుద్ధం రాజుకుంది. ప్రాణభయంతో హదీ సౌదీ అరేబియాకు పారిపోవడంతో సలేహ్ హుతి రెబల్స్తో కలిసి మూడేళ్ల కిత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కానీ ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో వారం రోజుల క్రితమే సలేహ్ హుతి రెబల్స్ నుంచి విడిపోయారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి