రూ.999కే ఎయిర్ ఏషియా టిక్కెట్టు

- December 04, 2017 , by Maagulf
రూ.999కే ఎయిర్ ఏషియా టిక్కెట్టు

న్యూఢిల్లీ : చౌకయాన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 10 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మే 7, 2018 నుంచి జనవరి 31, 2019 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు తెలిసింది. ఇతర విమానయాన సంస్థలు కూడా రూ.1,099కే టికెట్టును అందిస్తున్నట్లు ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com