హఫీజ్ సయీద్తో పొత్తుకు సిద్ధమే: ముషారఫ్
- December 05, 2017
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు ఇటీవలే జై కొట్టిన పాక్ మాజీ మిలటరీ రూలర్.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్తో పొత్తు సిద్దమని ముషారఫ్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పాకిస్తాన్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. ‘పొత్తు విషయమై నేను వారితో మాట్లాడలేదు, అయితే వారు ముందుకుకొస్తే అహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముషారఫ్ చెప్పారు.
గత నెల్లో పాకిస్తాన్లోని 23 పార్టీలతో కలిపి అవామీ ఇత్తేహాద్ కూటమిని ముషారఫ్ ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనూ కూటమి కకావికలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు అతిపెద్ద మద్దతుదారుడిని అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ముంబై దాడుల తరువాత హఫీజ్ సయీద్ని అమెరికా సైతం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని తలమీద 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. పాకిస్తాన్లోని పలు మతసంస్థలపై హఫీజ్ సయీద్ పట్టుసాధించాడు. హఫీజ్ సయీద్ ఉగ్రవాది కాదని.. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి హఫీజ్ సయీద్ పేరును తొలగించాలని ముషారఫ్ కోరారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!