మరో డిఎస్సీని ప్రకటించిన ఏపి ప్రభుత్వం

- December 06, 2017 , by Maagulf
మరో డిఎస్సీని ప్రకటించిన ఏపి ప్రభుత్వం

అమరావతి : 2018 డీఎస్సీ నోటిఫికేషన్‌ను మంత్రి గంటా శ్రీనివాస్ బుధవారం ప్రకటనను జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబరు 26 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మొత్తం 12, 370 పోస్టులకు నియామకాలు జరుగుతాయన్నారు. ఈమేరకు మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. ఏపిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే సర్కారు యొక్క లక్ష్యమన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టినట్టుగానే ఉద్యోగాలపై హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com