తగ్గిన పసిడి ధరలు
- December 06, 2017బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం, అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుండటంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ.200 మేర తగ్గాయి. బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు 200 రూపాయలు తగ్గి రూ.30,050గా నమోదయ్యాయి. అంతేకాక వెండి ధరలు కూడా కిందకి పడిపోయాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో, వెండి ధరలు రూ.500 తగ్గి, కేజీకి రూ.38,500గా రికార్డయ్యాయి.
అంతర్జాతీయంగా కూడా బంగారం ధర 0.76 శాతం తగ్గి, ఔన్స్కు 1,265.90 డాలర్లు, వెండి ధర 1.41 శాతం క్షీణించి, ఔన్స్కు 16.06 డాలర్లు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు 200 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,050గా, రూ.29,900గా ఉన్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?