సినిమాలకు వీడ్కోలు చెప్పేస్తానంటున్న పవన్ కళ్యాణ్
- December 08, 2017
విజయవాడ: విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సమావేశంలో మాట్లాడుతూ...పరిటాల రవి నాకు గుండు కొట్టించాడనేది పచ్చి అబద్ధం అని పవన్ స్పష్టం చేశారు. అది టిడిపి వాళ్లు సృష్టించిన ప్రచారం అని పవన్ కొట్టిపారేశారు. సినిమాలపై చికాకు వచ్చి నేనే గుండు కొట్టించుకున్నానని పవన్ తెలిపారు. ఈ ప్రచారం మొదలైనప్పుడు పరిటాల రవి ఎవరో నాకు తెలియదని పవన్ పేర్కొన్నారు. ప్రజల కోసమే టిడిపికి మద్దతిచ్చాను. వైఎస్ జగన్పై అభియోగాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి నేను ఎందుకు మద్దతిస్తానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపిలో కుల పిచ్చి ఎక్కువగా ఉందని, ఈమేరకు కుల పిచ్చి వదుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని పవన్ పేర్కొన్నారు. నిరాయధుడిగా ఉన్న రంగాను చంపడం తప్పని, రంగా ప్రస్తావన లేకుండా బెజవాడ రాజకీయాలు లేవని పవన్ వెల్లడించారు. ఇక సినిమాలు వదిలేస్తున్నానని పవన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!