మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు!
- December 08, 2017
ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఇద్దరు కవల పిల్లలు చనిపోయారని చెప్పి వారిని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ తీరు ఆమోదయోగ్యమైనది కాదని, అందుకే హాస్పిటల్ లైసెన్సు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి నుంచి ఇక ఆ హాస్పిటల్లో రోగులకు చికిత్స అందిచడానికి వీల్లేదని తెలిపారు. ఇటీవల మ్యాక్స్ హాస్పిటల్లో జన్మించిన ఇద్దరు కవలలు చనిపోయినట్లు చెప్పి వారి మృతదేహాలను ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్తుండగా అందులో ఉన్న ఓ బిడ్డలో కదలికలు రావడం తండ్రి గమనించాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఇవ్వడంతో బతికి ఉన్న చిన్నారికి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆ చిన్నారి కూడా బుధవారం మృతి చెందింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!