కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ

- November 16, 2015 , by Maagulf
కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ

రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. ఐడీహెచ్ కాలనీలో జరిగిన కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తలసాని అధ్యక్షత వహించారు. ఇంకా మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తనకు ఇవాళ సంతోషకరమైన రోజు అన్నారు. పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి వారిని సొంతింటి వారిని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మొత్తం 396 ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం అధికారులు ఎంపిక చేసిన ఐదుగురికి సీఎం పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఆనందంతో సీఎంకు పాదాభివందనం చేయడం కనిపించింది. వద్దంటూ సీఎం వారిని వారిస్తూ సుతిమెత్తగా పక్కకు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com