కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ
- November 16, 2015
రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. ఐడీహెచ్ కాలనీలో జరిగిన కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తలసాని అధ్యక్షత వహించారు. ఇంకా మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, మహేందర్రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తనకు ఇవాళ సంతోషకరమైన రోజు అన్నారు. పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి వారిని సొంతింటి వారిని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మొత్తం 396 ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం అధికారులు ఎంపిక చేసిన ఐదుగురికి సీఎం పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఆనందంతో సీఎంకు పాదాభివందనం చేయడం కనిపించింది. వద్దంటూ సీఎం వారిని వారిస్తూ సుతిమెత్తగా పక్కకు జరిపారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







