రైలు ప్రమాదం లో ఆరు ఏనుగులు మృతి
- December 10, 2017
అత్యంత హృదయవిదారకమైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఐదు పెద్ద ఏనుగులు, ఓ చిన్న ఏనుగు పిల్ల దుర్మరణం పాలయ్యాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో గువాహటి-నహర్లాగున్ ఎక్స్ప్రెస్ రైలు ఈ ఏనుగులను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా, బలిపర సమీపంలో ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతానికి ఏనుగుల వాటికగా మంచి పేరు ఉంది. గ్రామాలు విస్తరిస్తుండటంతో అడవుల నరికివేత జోరుగా సాగుతోంది. సోనిత్పూర్లో 70 శాతం అడవులు కనుమరుగయ్యాయి. అడవుల్లో నివసించే జంతువులకు రక్షణ ఉండటం లేదు. 2013-2016 సంవత్సరాల మధ్య దాదాపు 140 ఏనుగులు అసహజంగా మరణించాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!