భారత్‌పై లంక ఘన విజయం

- December 10, 2017 , by Maagulf
భారత్‌పై లంక ఘన విజయం

ధర్మశాల: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై లంక ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 113 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 20.4 ఓవర్లలో 114 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దనుష్క గుణతిలక (1), ఉపుల్ తరంగ (49), లహిరు తిరుమన్నె (0) వికెట్లను కోల్పోయి అలవోకగా విజయ తీరానికి చేరుకుంది. ఉపుల్ తరంగ ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (25), నిరోషన్ డిక్‌వెల్లా (26) కలిసి జట్టుకు తొలి విజయాన్ని అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com