కేసీఆర్: జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతలకు సత్కారం

- December 11, 2017 , by Maagulf
కేసీఆర్: జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతలకు సత్కారం

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రపంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా జరగాలని, సాహిత్య, భాష ప్రాధాన్యంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులపాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ ఛైర్మన్, ఇతర నిర్వాహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ భారతీయ భాషల్లో రచనలు చేసి జ్ఞానపీఠ్ అవార్డులను పొందిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాలని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com