కొత్త పన్నులను ప్రవేశపెట్టడానికి యూఏఈ అన్వేషణ
- December 11, 2017
యూఏఈ : నూతన ఏడాదికి కొత్త పన్నులు యూఏఈ లో సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం వచ్చే నెలలో అమలులోకి తీసుకురానున్న5 శాతం విలువ ఆధారిత పన్ను (వాట్) తో పాటు కొత్త పన్నులను ప్రవేశపెట్టాలని యుపిఎ ప్రభుత్వం భావిస్తోంది. కాని ఆదాయ పన్నును ప్రవేశపెట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యుత్తమ అంతర్జాతీయ విధానాల ప్రకారం యూఏఈ ఇతర పన్నుల ఎంపికలను పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది." ఈ ఎంపికలు ఇప్పటికీ విశ్లేషణలో మరియు వాటిపై అధ్యయనం జరుగుతున్నాయి మరియు సమీప భవిష్యత్లో అవి పరిచయం చేయబడవు. యూఏఈ ప్రస్తుతం ఆదాయ పన్నును ప్రవేశపెట్టడం లేదు. "సౌదీ అరేబియా మరియు యుఎఇలలో 2018 జనవరి1 వ తేదీ నుంచి వ్యాట్ ( విలువ ఆధారిత పన్ను)ను ప్రవేశపెడతాయి. దీంతో వ్యాట్ పన్ను ను అమలుచేసే అరేబియా గల్ఫ్ లోని తొలి దేశంగా యూఏఈ ప్రసిద్ధి చెందనుంది. అదేవిధంగా గత అక్టోబర్ నుంచి యుఎఇ, పొగాకుపై , శక్తిని ఇచ్చే పానీయాలపై ఎక్సైజ్ పన్ను 100 శాతం అమలుచేస్తోంది. అలాగే శీతలపానీయాలపై 50 శాతం చొప్పున పన్నును ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, పర్యావరణ సమస్యలను అధిగమించడానికి ఈ నూతన పన్నుల పెంపుదల అనివార్యమైంది. చమురు నుండి ప్రభుత్వ ఆదాయం క్షీణించడంతో ఆ లోటుని భర్తీ చేయడానికి యూఏఈ మరియు ఇతర ఐదు అరేబియా గల్ఫ్ రాష్ట్రాలు ఈ తరహా పన్నులను ప్రజలకు పరిచయం చేయక తప్పడం లేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







