కొత్త పన్నులను ప్రవేశపెట్టడానికి యూఏఈ అన్వేషణ
- December 11, 2017
యూఏఈ : నూతన ఏడాదికి కొత్త పన్నులు యూఏఈ లో సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం వచ్చే నెలలో అమలులోకి తీసుకురానున్న5 శాతం విలువ ఆధారిత పన్ను (వాట్) తో పాటు కొత్త పన్నులను ప్రవేశపెట్టాలని యుపిఎ ప్రభుత్వం భావిస్తోంది. కాని ఆదాయ పన్నును ప్రవేశపెట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యుత్తమ అంతర్జాతీయ విధానాల ప్రకారం యూఏఈ ఇతర పన్నుల ఎంపికలను పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది." ఈ ఎంపికలు ఇప్పటికీ విశ్లేషణలో మరియు వాటిపై అధ్యయనం జరుగుతున్నాయి మరియు సమీప భవిష్యత్లో అవి పరిచయం చేయబడవు. యూఏఈ ప్రస్తుతం ఆదాయ పన్నును ప్రవేశపెట్టడం లేదు. "సౌదీ అరేబియా మరియు యుఎఇలలో 2018 జనవరి1 వ తేదీ నుంచి వ్యాట్ ( విలువ ఆధారిత పన్ను)ను ప్రవేశపెడతాయి. దీంతో వ్యాట్ పన్ను ను అమలుచేసే అరేబియా గల్ఫ్ లోని తొలి దేశంగా యూఏఈ ప్రసిద్ధి చెందనుంది. అదేవిధంగా గత అక్టోబర్ నుంచి యుఎఇ, పొగాకుపై , శక్తిని ఇచ్చే పానీయాలపై ఎక్సైజ్ పన్ను 100 శాతం అమలుచేస్తోంది. అలాగే శీతలపానీయాలపై 50 శాతం చొప్పున పన్నును ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, పర్యావరణ సమస్యలను అధిగమించడానికి ఈ నూతన పన్నుల పెంపుదల అనివార్యమైంది. చమురు నుండి ప్రభుత్వ ఆదాయం క్షీణించడంతో ఆ లోటుని భర్తీ చేయడానికి యూఏఈ మరియు ఇతర ఐదు అరేబియా గల్ఫ్ రాష్ట్రాలు ఈ తరహా పన్నులను ప్రజలకు పరిచయం చేయక తప్పడం లేదు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









