భారత అమ్ముల పొదిలో మరో అధునాతన ఆయుధం!

- December 12, 2017 , by Maagulf
భారత అమ్ముల పొదిలో మరో అధునాతన ఆయుధం!

ఢిల్లీ: భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అధునాతన ఆయుధ వ్యవస్థ చేరనుంది. రష్యన్‌ ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ విక్రయ ఒప్పందంపై భారత్‌, రష్యా త్వరలోనే సంతకాలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకుంటున్నట్టు రష్యా వెల్లడించింది. ధర, శిక్షణ, సాంకేతికత బదిలీ, నియంత్రణ వ్యవస్థల ఏర్పాట్లపై భారత్, రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎస్‌-400ను సరఫరా చేసినా వ్యవస్థ గురించి శిక్షణనిచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. రష్యా నుంచి ఐదు బిలియన్‌ డాలర్లతో ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కొనుగోలు చేస్తామని గతేడాది అక్టోబర్‌లో భారత్‌ ప్రకటించింది. దాంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్‌ హెలికాఫ్టర్ల తయారీ చేపడతాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com