భారత అమ్ముల పొదిలో మరో అధునాతన ఆయుధం!
- December 12, 2017
ఢిల్లీ: భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అధునాతన ఆయుధ వ్యవస్థ చేరనుంది. రష్యన్ ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విక్రయ ఒప్పందంపై భారత్, రష్యా త్వరలోనే సంతకాలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకుంటున్నట్టు రష్యా వెల్లడించింది. ధర, శిక్షణ, సాంకేతికత బదిలీ, నియంత్రణ వ్యవస్థల ఏర్పాట్లపై భారత్, రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎస్-400ను సరఫరా చేసినా వ్యవస్థ గురించి శిక్షణనిచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. రష్యా నుంచి ఐదు బిలియన్ డాలర్లతో ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తామని గతేడాది అక్టోబర్లో భారత్ ప్రకటించింది. దాంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్ హెలికాఫ్టర్ల తయారీ చేపడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!