వరుసగా రెండోరోజు భూకంపం... వణుకుతున్న ఇరాన్
- December 12, 2017
టెహ్రాన్(ఇరాన్): ఇటీవల వరుస భూకంపాలతో ఇరాన్ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న కెర్మాన్ ప్రావిన్స్లో చోటుచేసుకున్న భూకంపం మర్చిపోకముందే... మళ్లీ ఈరోజు ఉదయం ఉత్తర, మధ్య ఇరాన్ను భూప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్ స్కేలు వద్ద ఇవాళ చోటుచేసుకున్న భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ఇంకా సమాచారం లేదు. అత్యంత సమస్యాత్మక రేఖలపై ఉండడంతో భూకంప బాధిత దేశంగా మారిన ఇరాన్.. ఇటీవల అపార నష్టం చవిచూస్తోంది. నిన్న కెర్మాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా నెలరోజుల క్రితం 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరాన్ పశ్చిమ ప్రావిన్స్ కెర్మాన్షాను అతలాకుతలం చేసింది. ఈ భూవిలయంతో 530కి పైగా ప్రాణాలు కోల్పోగా... దాదాపు 8వేల మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!