పల్లీలు గుండెకు మేలు.!
- December 13, 2017
పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదు, వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది తదితర అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అవి కేవలం అపోహలు మాత్రమేననీ, పల్లీలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి అంటున్నారు పరిశోధకులు. మధ్యాహ్నం భోజనంతో పాటు కొన్ని పల్లీలు నేరుగా లేదా షేక్ రూపంలో తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. పదహారు మందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపువారికి మధ్యాహ్నం భోజనం తరువాత గుప్పెడు పల్లీలు ఇచ్చారు. రెండో గ్రూపు వారికి సాధారణ డ్రింక్ను ఇచ్చారు కొన్ని గంటల అనంతరం వీరిని పరీక్షించగా, పల్లీలు తీసుకున్న వారిలో ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గిన విషయాన్ని గుర్తించారు. మామూలుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పల్లీలు తినడం వలన వీటి స్థాయి పెరగకుండా తగ్గడం అనేది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చక్కెర వ్యాధిగ్రస్తులు పల్లీలు తీసుకునే విషయంలో వైద్యుల సలహా తీసకోవడం తప్పనిసరి అని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!