పల్లీలు గుండెకు మేలు.!
- December 13, 2017పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదు, వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది తదితర అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అవి కేవలం అపోహలు మాత్రమేననీ, పల్లీలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి అంటున్నారు పరిశోధకులు. మధ్యాహ్నం భోజనంతో పాటు కొన్ని పల్లీలు నేరుగా లేదా షేక్ రూపంలో తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. పదహారు మందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపువారికి మధ్యాహ్నం భోజనం తరువాత గుప్పెడు పల్లీలు ఇచ్చారు. రెండో గ్రూపు వారికి సాధారణ డ్రింక్ను ఇచ్చారు కొన్ని గంటల అనంతరం వీరిని పరీక్షించగా, పల్లీలు తీసుకున్న వారిలో ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గిన విషయాన్ని గుర్తించారు. మామూలుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పల్లీలు తినడం వలన వీటి స్థాయి పెరగకుండా తగ్గడం అనేది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చక్కెర వ్యాధిగ్రస్తులు పల్లీలు తీసుకునే విషయంలో వైద్యుల సలహా తీసకోవడం తప్పనిసరి అని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా