ఫిబ్రవరి 9న ‘గాయత్రి’ రిలీజ్
- December 13, 2017
విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘గాయత్రి’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, ఇటీవలే వీరిరువురిపై కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు.
నిఖిలా విమల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, నిర్మాతలు ఫిబ్రవరి 9, 2018 ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







