రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నారా బ్రాహ్మణి

- December 14, 2017 , by Maagulf
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నారా బ్రాహ్మణి

ఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ సంస్థకు అవార్డు లభించింది. దేశంలో ఇంధన ఆదాలో ప్రతిభ కనబరిచిన పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అయితే... ఇందులో హెరిటేజ్ సంస్థ కూడా ఉండడం గమనార్హం. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ ఇంధన ఆదా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తదితరులు విచ్చేశారు. కాగా... అవార్డులకు ఎంపికైన సంస్థల ప్రతినిధులకు రాష్ట్రపతి, కేంద్ర మంతి అవార్డులను ప్రదానం చేయనుండగా హెరిటేజ్ సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న నారా బ్రాహ్మణి ఈ అవార్డును మరికాసేపట్లో అందుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com