సౌదీ టార్గెట్: ఇరాన్లో తయారైన మిస్సైల్ని సంధించిన హౌతీ మిలిటెంట్స్
- December 16, 2017మనామా: సౌదీ పైకి యెమెన్లోని మిలిటెంట్స్ ప్రయోగించిన ఓ మిస్సైల్, ఇరాన్ తయారీగా రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేయడంతో, ఇరాన్ తీరు పట్ల బహ్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యెమెన్లో అల్లర్లకు ఇరాన్ ప్రోత్సాహం అందించడమే కాకుండా, అరబ్, జిసిసి దేశాల్లో అస్థిరతకు హౌతీ మిలిటెంట్స్కి ఇరాన్ అండగా ఉండి, ఆయుధాల్ని కూడా అందజేస్తోందని బహ్రెయిన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. అమెరికా, అలాగే యునైటెడ్ నేషన్స్ ఈ విషయంలో ఇరాన్ తీరుని తప్పు పట్టడాన్ని బహ్రెయిన్ ప్రస్తావించింది. ఇరాన్ తక్షణం ఈ చర్యల్ని ఆపాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశంతో అయినా స్నేహ సంబంధాలు కొనసాగించే ప్రశ్నే లేదని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలిసి పోరాడేందుకు బహ్రెయిన్ ముందుంటుందని బహ్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?