సౌదీ టార్గెట్: ఇరాన్లో తయారైన మిస్సైల్ని సంధించిన హౌతీ మిలిటెంట్స్
- December 16, 2017
మనామా: సౌదీ పైకి యెమెన్లోని మిలిటెంట్స్ ప్రయోగించిన ఓ మిస్సైల్, ఇరాన్ తయారీగా రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేయడంతో, ఇరాన్ తీరు పట్ల బహ్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యెమెన్లో అల్లర్లకు ఇరాన్ ప్రోత్సాహం అందించడమే కాకుండా, అరబ్, జిసిసి దేశాల్లో అస్థిరతకు హౌతీ మిలిటెంట్స్కి ఇరాన్ అండగా ఉండి, ఆయుధాల్ని కూడా అందజేస్తోందని బహ్రెయిన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. అమెరికా, అలాగే యునైటెడ్ నేషన్స్ ఈ విషయంలో ఇరాన్ తీరుని తప్పు పట్టడాన్ని బహ్రెయిన్ ప్రస్తావించింది. ఇరాన్ తక్షణం ఈ చర్యల్ని ఆపాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశంతో అయినా స్నేహ సంబంధాలు కొనసాగించే ప్రశ్నే లేదని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలిసి పోరాడేందుకు బహ్రెయిన్ ముందుంటుందని బహ్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







