సౌదీ టార్గెట్: ఇరాన్లో తయారైన మిస్సైల్ని సంధించిన హౌతీ మిలిటెంట్స్
- December 16, 2017
మనామా: సౌదీ పైకి యెమెన్లోని మిలిటెంట్స్ ప్రయోగించిన ఓ మిస్సైల్, ఇరాన్ తయారీగా రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేయడంతో, ఇరాన్ తీరు పట్ల బహ్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యెమెన్లో అల్లర్లకు ఇరాన్ ప్రోత్సాహం అందించడమే కాకుండా, అరబ్, జిసిసి దేశాల్లో అస్థిరతకు హౌతీ మిలిటెంట్స్కి ఇరాన్ అండగా ఉండి, ఆయుధాల్ని కూడా అందజేస్తోందని బహ్రెయిన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. అమెరికా, అలాగే యునైటెడ్ నేషన్స్ ఈ విషయంలో ఇరాన్ తీరుని తప్పు పట్టడాన్ని బహ్రెయిన్ ప్రస్తావించింది. ఇరాన్ తక్షణం ఈ చర్యల్ని ఆపాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశంతో అయినా స్నేహ సంబంధాలు కొనసాగించే ప్రశ్నే లేదని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలిసి పోరాడేందుకు బహ్రెయిన్ ముందుంటుందని బహ్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







