రెండు గంటల్లోనే వెంకన్న దర్శనం
- December 17, 2017
శ్రీవారి దర్శనం కోసం ఇకపై గంటల తరబడి నిరీక్షించాల్సిన పనిలేదు.. క్యూలైన్లలో కష్టాలు పడాల్సిన అవసరం అసలే లేదు.. కేవలం రెండు గంటల్లోనే వెంకన్నను దర్శించుకుని బయటకు రావచ్చు.. ఈ సరికొత్త విధానానికి టీటీడీ ఈరోజు నుంచి తెరతీయనుంది.. ఈరోజు నుంచి సర్వ దర్శనం భక్తులకూ టైమ్ స్లాట్ విధానాన్ని అమలు చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా దర్శనం పూర్తిచేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు, కాలినడకన వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్నారు అధికారులు.. ఈ విధానం సక్సెస్ఫుల్గా రన్ అవుతుండటంతో, కొత్త ప్రయోగానికి తెరతీశారు. సర్వ దర్శనం భక్తులకు రోజుకు 30వేల వరకు టోకెన్లు టైమ్స్లాట్ పద్ధతిన జారీచేయనుంది. ఇందుకోసం తిరుమలలో 14 కేంద్రాల్లో 117 కౌంటర్లను ఏర్పాటు చేసింది. బార్ కోడింగ్ విధానం ద్వారా భక్తులకు టోకెన్లు జారీచేయనుంది. నిర్దేశించిన సమయంలో క్యూలైన్లోకి ప్రవేశించడం ద్వారా రెండు గంటల్లోనే దర్శనం పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది.
రెండు నెలల నుంచి దీనిపై కసరత్తు చేసిన అధికారులు.. టికెట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈనెల 23 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ప్రయోగం సక్సెస్ అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ఇక టైమ్ స్లాట్ విధానంలో దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







