'అజ్ఞాతవాసి' ఆఫీసు వద్ద అలజడి!
- December 18, 2017
పవన్ కళ్యాణ్ పాతికవ సినిమా 'అజ్ఞాతవాసి' కోసం పవర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు బైటికొచ్చేశాయి. కంటెంట్ పరంగా కూడా భారీగా అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఫిలింగా మారింది. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను ఈనెల 19న అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ టెలికాస్టింగ్ హక్కుల్ని ఒక న్యూస్ ఛానల్ 85 లక్షలకు కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి.
మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొస్తారన్న క్లారిటీ లేనప్పటికీ.. ఈ ఫంక్షన్ భారీ స్థాయిలో జరగవచ్చన్న అంచనా అయితే వుంది. ఇదిలా ఉంటే.. ఈ వేడుకను చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు ఎగబడుతున్నారు. ఎంట్రీ పాసులు ఇస్తారన్న వార్తలు రావడంతో... బంజారా హిల్స్ లోని నిర్మాణ సంస్థ 'హారికా హాసిని' క్రియేషన్స్ వద్ద వందలాంది మంది ఫ్యాన్స్ గుమిగూడారు.
మధ్యాహ్నం నుంచి వేచివున్నప్పటికీ టిక్కెట్స్ ఇవ్వకపోవడంతో వీళ్ళలో అసహనం పెరిగిపోయింది. చివరకు ఫాన్స్ ని కట్టడి చేయడానికి బౌన్సర్లను ప్రయోగించాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల