ఓరినీ! ఇది చేపను పోలిన మనిషి కాదట..!!
- December 18, 2017
ఈ మద్య సోషల్ మీడియాలో ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతుంది. ఆ మద్య వైజాగ్ లో రెండు వింత పక్షులు వచ్చాయని..అవి ఏలియన్స్ అని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు..తీరా చూస్తే అవి గుడ్లగూబ జాతికి చెందిన పక్షులని తెలియడంతో అంతా నీరుగారిపోయారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో అలాంటి వార్త ఒకటి వైరల్ అవుతోంది. అది కూడా విశాఖ నుంచే కావడం విశేషం. విశాఖ తీరంలో జాలర్లకు అచ్చం మనిషిని పోలిన చేప దొరికిందని అంటున్నారు.
ముందు ఉదర భాగం, చేతులు అచ్చం మనిషి పోలి ఉన్న ఆ చేప వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాం..ఆయితో ఆ వీడియోలో నిజంగా మనిషిని పోలినట్లు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
దీనికి గురించి కొంత మంది వాకబు చేయగా..అది, అస్సలు జీవే కాదని, ఓ కళాకారుడు రూపొందించిన కళాఖండమని తెలిసింది. మయన్మార్కు చెందిన ఓ కళాకారుడు చెక్క, ఫైబర్ వినియోగించి ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు మయన్మార్ పత్రికలు వెల్లడించారు. ఈ కళాఖండం సహజంగా కనిపించేందుకు దాని గొంతు భాగంలో మోటారును ఏర్పాటు చేశారు.
ఈ కళాఖండానికి చెందిన ఫొటోలు, వీడియోలు.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. కొందరు ఇది విశాఖపట్నంలోనే దొరికిందంటూ తప్పుడు ప్రచారం చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ గా షేరవుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







