గ్యాంబ్లింగ్: మనామాలో 12 మంది వలసదారుల అరెస్ట్
- December 18, 2017
మస్కట్: 13 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్కి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిని సలాలాలో అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. దోఫార్ పోలీస్ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియాకి చెందిన 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓ రెంటెడ్ అపార్ట్మెంట్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన విచారణ బృందం వ్యూహాత్మకంగా నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఈ సందర్బంగా వారి నుంచి పెద్ద మొత్తంలో నగదుని కూడా స్వాదీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్కి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకు కఠినమైన చట్టాలున్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్ళ దాకా జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా దోషులకు పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







