గ్యాంబ్లింగ్: మనామాలో 12 మంది వలసదారుల అరెస్ట్
- December 18, 2017
మస్కట్: 13 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్కి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిని సలాలాలో అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. దోఫార్ పోలీస్ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియాకి చెందిన 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓ రెంటెడ్ అపార్ట్మెంట్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన విచారణ బృందం వ్యూహాత్మకంగా నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఈ సందర్బంగా వారి నుంచి పెద్ద మొత్తంలో నగదుని కూడా స్వాదీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్కి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకు కఠినమైన చట్టాలున్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్ళ దాకా జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా దోషులకు పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!