గ్యాంబ్లింగ్: మనామాలో 12 మంది వలసదారుల అరెస్ట్
- December 18, 2017
మస్కట్: 13 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్కి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిని సలాలాలో అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. దోఫార్ పోలీస్ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియాకి చెందిన 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓ రెంటెడ్ అపార్ట్మెంట్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన విచారణ బృందం వ్యూహాత్మకంగా నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఈ సందర్బంగా వారి నుంచి పెద్ద మొత్తంలో నగదుని కూడా స్వాదీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్కి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకు కఠినమైన చట్టాలున్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్ళ దాకా జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా దోషులకు పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







