ముగింపు రోజున కేసీఆర్ ఏం తేల్చనున్నాడో
- December 19, 2017
ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపుకొచ్చేశాయి. 42 దేశాల నుంచి 450మంది విదేశీ ప్రతినిధులు విచ్చేసిన ఈ సభలు ఇప్పటికే విజయవంతం అయినట్లు.. ఇంటా బైటా చెప్పుకుంటున్నారు. కానీ.. మహాసభలు ఎంతమేరకు సక్సెస్ అయ్యాయన్నది కేసీఆర్ ఇచ్చే ఫినిషింగ్ టచెస్ మీద మాత్రమే ఆధారపడి వుంది. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన సభలు.. ఈరోజు రాష్ట్రపతి సమక్షంలో ముగియనున్నాయి. ఈ వేదిక మీద కేసీఆర్ ఇచ్చే ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తెలుగు అభ్యాసాన్ని తప్పనిసరి చేసిన ఆయన దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తారు. పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటా కల్పించాలని, తెలుగు భాషా పండితుల సమస్యల్ని పరిష్కరించాలని కేసీఆర్ దగ్గర ప్రతిపాదనలున్నాయి. ఇవి కాకుండా.. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం తెలుగు మహాసభల్ని నిర్వహించుకుని, తెలుగు భాష అభివృద్ధికి పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందజేసేలా నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందులా తూతూ మంత్రంలా కాకుండా తన నేతృత్వంలో జరిగిన తెలుగు మహాసభలు పూర్తి ఫలవంతం కావాలన్నది కేసీఆర్ ఆలోచన.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







