ముగింపు రోజున కేసీఆర్ ఏం తేల్చనున్నాడో
- December 19, 2017
ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపుకొచ్చేశాయి. 42 దేశాల నుంచి 450మంది విదేశీ ప్రతినిధులు విచ్చేసిన ఈ సభలు ఇప్పటికే విజయవంతం అయినట్లు.. ఇంటా బైటా చెప్పుకుంటున్నారు. కానీ.. మహాసభలు ఎంతమేరకు సక్సెస్ అయ్యాయన్నది కేసీఆర్ ఇచ్చే ఫినిషింగ్ టచెస్ మీద మాత్రమే ఆధారపడి వుంది. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన సభలు.. ఈరోజు రాష్ట్రపతి సమక్షంలో ముగియనున్నాయి. ఈ వేదిక మీద కేసీఆర్ ఇచ్చే ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తెలుగు అభ్యాసాన్ని తప్పనిసరి చేసిన ఆయన దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తారు. పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటా కల్పించాలని, తెలుగు భాషా పండితుల సమస్యల్ని పరిష్కరించాలని కేసీఆర్ దగ్గర ప్రతిపాదనలున్నాయి. ఇవి కాకుండా.. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం తెలుగు మహాసభల్ని నిర్వహించుకుని, తెలుగు భాష అభివృద్ధికి పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందజేసేలా నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందులా తూతూ మంత్రంలా కాకుండా తన నేతృత్వంలో జరిగిన తెలుగు మహాసభలు పూర్తి ఫలవంతం కావాలన్నది కేసీఆర్ ఆలోచన.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







