ముగింపు రోజున కేసీఆర్ ఏం తేల్చనున్నాడో
- December 19, 2017
ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపుకొచ్చేశాయి. 42 దేశాల నుంచి 450మంది విదేశీ ప్రతినిధులు విచ్చేసిన ఈ సభలు ఇప్పటికే విజయవంతం అయినట్లు.. ఇంటా బైటా చెప్పుకుంటున్నారు. కానీ.. మహాసభలు ఎంతమేరకు సక్సెస్ అయ్యాయన్నది కేసీఆర్ ఇచ్చే ఫినిషింగ్ టచెస్ మీద మాత్రమే ఆధారపడి వుంది. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన సభలు.. ఈరోజు రాష్ట్రపతి సమక్షంలో ముగియనున్నాయి. ఈ వేదిక మీద కేసీఆర్ ఇచ్చే ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తెలుగు అభ్యాసాన్ని తప్పనిసరి చేసిన ఆయన దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తారు. పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటా కల్పించాలని, తెలుగు భాషా పండితుల సమస్యల్ని పరిష్కరించాలని కేసీఆర్ దగ్గర ప్రతిపాదనలున్నాయి. ఇవి కాకుండా.. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం తెలుగు మహాసభల్ని నిర్వహించుకుని, తెలుగు భాష అభివృద్ధికి పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందజేసేలా నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందులా తూతూ మంత్రంలా కాకుండా తన నేతృత్వంలో జరిగిన తెలుగు మహాసభలు పూర్తి ఫలవంతం కావాలన్నది కేసీఆర్ ఆలోచన.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







