ప్రముఖ పాప్ సింగర్ ఆత్మహత్య..!!
- December 19, 2017
ప్రముఖ దక్షిణ కొరియన్ పాప్ స్టార్... టాప్ రాక్ బ్యాండ్స్ లో ఒకటైన షినీ టీం లో ప్రధాన గాయకుడైన కిమ్ జోంగ్ హ్యూన్ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిమ్ మృత దేహం రాజధాని.. సియోల్ హోటల్ లో పోలీసులకు లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియన్ టాప్ రాక్ బ్యాండ్స్ లో ఒకటైన షినీ టీం లో 27 ఏళ్ల కిమ్ జోంగ్ ప్రధాన గాయకుడు.. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న కిమ్.. గత వారంలో కూడా సియోల్ లో చాలా కచేరీలు చేశాడు.. కాగా కిమ్ ఆత్మహత్య చేసుకొనే ముందు తన సోదరికి "ఇదే నా ఆఖరి ఫేర్ వెల్.. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి.. ఇక నేను బతకలేను.. నన్ను వెళ్లనివ్వు" అని మెసేజ్ చేశాడు.. మెసేజ్ చూసిన సోదరి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే స్పందించి.. హోటల్ కి వెళ్ళి చూసేసరికి.. అప్పటికే జోంగ్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ప్రాధమిక చికిత్సను అందించినా ఫలితం లేకపోయింది. ఆ హోటల్ లో బొగ్గులాంటి పదార్ధాన్ని కాల్చి కిమ్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కిమ్ 2015 లో రిలీజ్ చేసిన "బిల్ బోర్డ్" అనే ఆల్బమ్స్ చార్ట్ లో మొదట ప్లేస్ ను దక్కించుకొన్నది.. కాగా కిమ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడో తెలియక అతడి సోదరి.. అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







