ప్రముఖ పాప్ సింగర్ ఆత్మహత్య..!!
- December 19, 2017
ప్రముఖ దక్షిణ కొరియన్ పాప్ స్టార్... టాప్ రాక్ బ్యాండ్స్ లో ఒకటైన షినీ టీం లో ప్రధాన గాయకుడైన కిమ్ జోంగ్ హ్యూన్ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిమ్ మృత దేహం రాజధాని.. సియోల్ హోటల్ లో పోలీసులకు లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియన్ టాప్ రాక్ బ్యాండ్స్ లో ఒకటైన షినీ టీం లో 27 ఏళ్ల కిమ్ జోంగ్ ప్రధాన గాయకుడు.. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న కిమ్.. గత వారంలో కూడా సియోల్ లో చాలా కచేరీలు చేశాడు.. కాగా కిమ్ ఆత్మహత్య చేసుకొనే ముందు తన సోదరికి "ఇదే నా ఆఖరి ఫేర్ వెల్.. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి.. ఇక నేను బతకలేను.. నన్ను వెళ్లనివ్వు" అని మెసేజ్ చేశాడు.. మెసేజ్ చూసిన సోదరి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే స్పందించి.. హోటల్ కి వెళ్ళి చూసేసరికి.. అప్పటికే జోంగ్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ప్రాధమిక చికిత్సను అందించినా ఫలితం లేకపోయింది. ఆ హోటల్ లో బొగ్గులాంటి పదార్ధాన్ని కాల్చి కిమ్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కిమ్ 2015 లో రిలీజ్ చేసిన "బిల్ బోర్డ్" అనే ఆల్బమ్స్ చార్ట్ లో మొదట ప్లేస్ ను దక్కించుకొన్నది.. కాగా కిమ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడో తెలియక అతడి సోదరి.. అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







