రేపు సూర్యుడు, శని ఒకే రాశిలోకి.. 350 ఏళ్ల తరువాత తొలిసారి.. ప్రళయానికి సంకేతమా?
- December 20, 2017
అభివృద్ధిలో అగ్రపధం అని చాటి చెప్పుకుంటున్న పాశ్చాత్యులు సైతం జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. రేపు డిసెంబర్ 21ని తక్కువగా అంచనా వేయొద్దంటున్నారు. ఆరోజు పగలు సమయం తక్కువగా ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఏడాదీ జరిగేదే అయినా ఈ సారి వచ్చే 21 చాలా ప్రత్యేకమైనదంటున్నారు. సూర్యుడు, శని ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయని, ఇలా రావడం 350 ఏళ్ల తరువాత ఇదే తొలిసారని, ఇది ప్రళయానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.
1664 తరువాత ఖగోళంలో ఇలాంటి మార్పు కనిపించడం ఇది తొలిసారని నీల్ స్పెన్సర్ అనే జ్యోతీష్యుడు తెలిపాడు. సాధారణంగా వ్యక్తుల జాతకంలో శని మకర రాశిలోకి ప్రవేశిస్తే మంచే జరుగుతుందని, అయితే ఖగోళ పరంగా ఇది చాలా ప్రమాదకరమైందని వివరిస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏ శుభకార్యమూ మొదలు పెట్టవద్దంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవద్దంటున్నారు. పలువురు ఆస్ట్రాలజీ నిపుణులు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







