ప్రధాని మోడీకి రిసెప్షన్ ఆహ్వానం ఇచ్చిన విరుష్క జంట

- December 20, 2017 , by Maagulf
ప్రధాని మోడీకి రిసెప్షన్ ఆహ్వానం ఇచ్చిన విరుష్క జంట

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టి.. డిసెంబర్ 11న ఇటలీలో వివాహ బంధం తో ఒకటయ్యారు. ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. హనీమూన్ ముగించుకొన్న విరుష్క జంట.. బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని కుటుంబ సన్నితులకు విందు ఇచ్చిన ఈ దంపతులు రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రధాని మోడీనీ ని కలిసిన ఈ నవ దంపతులు వివాహ రిసెప్షన్ ఆహ్వానాన్ని అందజేశారు. విరుష్క దంపతులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని.. పీఎంవో ట్విట్టర్ లో తెలిపింది. ఈ నెల 26న సినీ, క్రికెట్ రాజకీయ సన్నిహితులకు విరుష్కలు విందు ఇవ్వనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com