రెహ్మాన్ తో స్వరం కలపనున్న రజిని
- December 20, 2017
చెన్నై: ఇళయరాజా తర్వాత సినీ సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన 'సంగీత తుపాను' ఏఆర్ రెహ్మాన్. ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను ఒకేసారి సొంతం చేసుకుని దేశానికే ఖ్యాతి తెచ్చి పెట్టారు. ఇటీవలే ఆయన 25 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 23వ తేదీన ఎన్కోర్ పేరిట దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రెహ్మాన్ సంగీత విభావరి జరగనుంది. 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా రెహ్మాన్ను సన్మానించే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే.. సూపర్స్టార్ రజనీకాంత్ కూడా పాల్గొని రెహ్మాన్ను సన్మానించనున్నారు. అంతేకాకుండా ఈ సంగీత విభావరిలో రజనీకాంత్ ఓ పాటను పాడనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా విడుదలకు సిద్ధమవుతున్న '2.ఓ' చిత్రానికి రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు. బహుశా ఆ సినిమాలోని పాటను పాడొచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా 1992లో 'మన్నన్' చిత్రంలో ఓ పాట పాడారు రజనీకాంత్.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







