ఫిషర్మెన్ని సన్మానించిన రాయల్ ఒమన్ పోలీస్
- December 21, 2017
మస్కట్: తగలబడిపోతున్న బోటు నుంచి తొమ్మిది మందిని రక్షించిన ఘటనలో 'హీరో'గా అందరి ప్రశంసలు అందుకున్నఫిషర్మెన్ని రాయల్ ఒమన్ పోలీసులు సన్మానించారు. ఆ హీరో పేరు జస్సెమ్ అల్ బథారి. అల్ షువైమియా ప్రాంతంలోని సముద్ర తీరంలో తొమ్మిది మంది పడవ ప్రమాదంలో ఇరుక్కోగా వారిని ఆయన రక్షించాడు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించగానే, తాను అటువైపుగా వెళ్ళాననీ, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అందులోనివారు సముద్రంలో దూకారనీ, అందులో కొందరికి ఈత రాదనీ, అతి కష్టమ్మీద అందర్నీ రక్షించి తన బోటులోకి చేర్చానని జస్సెమ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్అ ంబులెన్స్కి అలాగే రాయల్ ఒమన్ పోలీసులకి, తన స్నేహితుడొకరికి ఘటనపై సమాచారం ఇచ్చినట్లు జస్సెమ్ వివరించారు. అక్టోబర్ 1న ఈ ఘటన జరిగింది. దోఫార్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్ కల్నల్ అలీ బసాదిక్ సమక్షంలో జస్సెమ్ అల్ బథారికి సన్మానం జరిగింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!