త్వరలో అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు
- December 21, 2017
తమ దేశంలో పౌరఅణువిద్యుత్ తయారీలో అమెరికా సంస్థల భాగస్వామ్యంపై త్వరలోనే చర్చలు ప్రారంభం కాగలవని ఆశిస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. అన్నీ సజావుగా జరిగితే 2018 ఆరంభంలోనే అణువిద్యుత్ తయారీకోసం తొలి టెండర్ను జారీ చేస్తామని సౌదీ విద్యుత్ శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలి ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అణు విద్యుత్ ఉత్పాదన ద్వారా ఇంథన చమురువృధాను అరికట్టి ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశం వుంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు అమెరికన్ సంస్థలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ఈ క్రమం వేగం పుంజుకుంటాయని తాము భావిస్తున్నామని, అమెరికా చట్ట నిబంధనల మేరకు ఆయా సంస్థలు తమ దేశంలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించగలదని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. అణుకార్యక్రమాలను శాంతియుత ప్రయోజనాలకు తప్ప ఆయుధ ఉత్పాదనకు వినియోగించరాదంటూ తమతో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపే దేశాలకు అమెరికా షరతులు విధించే విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







