అగ్నికి దగ్ధమైన ఇల్లు ..... మంటలలో మాడి మసైన శిశువు
- December 21, 2017
మస్కట్ : ఓ పసిగుడ్డు మంటలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన వివరాల ప్రకారం, అల్-డాఖలీయా ప్రాంతం వద్ద నిజ్వా సౌక్ లో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరికొందరు వ్యక్తులు ఇంటి లోపల మంటలలో చిక్కుకున్నారని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వారు మంటలలో తీవ్రంగా గాయపడిన ఓ పసికందుని కనుగొన్నారు. దీంతో వారు అప్రమత్తమై అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించినట్లు అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపింది. ఇంటిలో అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించిందో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







