అగ్నికి దగ్ధమైన ఇల్లు ..... మంటలలో మాడి మసైన శిశువు
- December 21, 2017
మస్కట్ : ఓ పసిగుడ్డు మంటలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన వివరాల ప్రకారం, అల్-డాఖలీయా ప్రాంతం వద్ద నిజ్వా సౌక్ లో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరికొందరు వ్యక్తులు ఇంటి లోపల మంటలలో చిక్కుకున్నారని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వారు మంటలలో తీవ్రంగా గాయపడిన ఓ పసికందుని కనుగొన్నారు. దీంతో వారు అప్రమత్తమై అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించినట్లు అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపింది. ఇంటిలో అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించిందో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









