అగ్నికి దగ్ధమైన ఇల్లు ..... మంటలలో మాడి మసైన శిశువు
- December 21, 2017మస్కట్ : ఓ పసిగుడ్డు మంటలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన వివరాల ప్రకారం, అల్-డాఖలీయా ప్రాంతం వద్ద నిజ్వా సౌక్ లో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరికొందరు వ్యక్తులు ఇంటి లోపల మంటలలో చిక్కుకున్నారని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వారు మంటలలో తీవ్రంగా గాయపడిన ఓ పసికందుని కనుగొన్నారు. దీంతో వారు అప్రమత్తమై అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించినట్లు అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపింది. ఇంటిలో అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించిందో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..