కొత్త వ్యవస్థలో సౌదీ జనాభాలో సగం మందికి సంక్షేమ ఫలాలు
- December 22, 2017
దుబాయ్ : సౌదీ అరేబియా గురువారం 2 బిలియన్ సౌదీ రియళ్ళు ( 533 మిలియన్ డాలర్లు) మంజూరు చేసింది, తక్కువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన కుటుంబాల కోసం కొత్త సంక్షేమ వ్యవస్థలో మొట్టమొదటి నెలవారీ విడతలో కింగ్డమ్ జనాభాలో సగం మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ చెల్లింపులలో ఆహార పదార్ధాలు, సేవల వంటి అనేక వస్తువులపై 5 శాతం విలువ ఆధారిత పన్ను, అదేవిధంగా వచ్చే ఏడాది విద్యుత్ మరియు గ్యాసోలిన్ ధరలను పెంచి సబ్సిడీ లలో కోతలు విధించనున్నారు.కార్మిక మరియు సాంఘిక అభివృద్ధి మంత్రి అలీ అల్-ఘఫీస్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, బ్యాంకు బదిలీల నుంచి దాదాపుగా 3 మిలియన్ల కుటుంబాలకు అందచేసినట్లు తెలిపారు. ఇవి మొత్తం10.6 మిలియన్ల మంది లబ్ధిదారులకు చేరుకున్నాయి. అతను ఆ కుటుంబాలలో సగం మందికి కనీసం 938 సౌదీ రియళ్ళు (250 డాలర్లు ) గరిష్ట చెల్లింపుగాఉందని ఆయన అన్నారు. అలాగే కనీస చెల్లింపుga 300 సౌదీ రియళ్ళు ( 80 డాలర్లు) .ఈ రాబోయే ఆర్ధిక సంవత్సరం కనీసం 978 బిలియన్ సౌదీ రియళ్ళు ( 261 బిలియన్ డాలర్లు ) ఖర్చు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాజ్య చరిత్రలో అతిపెద్ద బడ్జెట్ ను ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజుల తరువాత చెల్లింపులు వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, ఇంధన పానీయాలపై ఈ ఏడాది పన్నులను , అదేవిధంగా విలాస వస్తువులపై భారీ పన్నును ప్రవేశపెట్టింది. 2018 నాటికి సిటిజన్స్ ఖాతా చెల్లింపులపై దాదాపుగా 32 బిలియన్ సౌదీ రియళ్ళు (8.5 బిలియన్ డాలర్లు) చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!