జయలలిత మృతి కేసులో శశికళ, అపోలో ప్రతాప్రెడ్డికి సమన్లు జారీ
- December 22, 2017
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో భాగంగా శశికళ, అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ ప్రతాప్రెడ్డికి సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు పంపింది. తీవ్ర అనారోగ్యంతో జయలలిత గతేడాది సెప్టెంబరు 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. దాదాపు 75 రోజుల పాటు చికిత్స పొంది.. డిసెంబరు 5న కన్ను మూశారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో శశికళ కుటుంబ సభ్యులు మినహా ముఖ్యనేతలెవరినీ అనుమతించలేదు. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విచారణకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ను నియమించింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, దృశ్యాలు బయటకు రాలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఒకరోజు ముందు దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి దృశ్యాలు విడుదుల చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







