జయలలిత మృతి కేసులో శశికళ, అపోలో ప్రతాప్రెడ్డికి సమన్లు జారీ
- December 22, 2017
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో భాగంగా శశికళ, అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ ప్రతాప్రెడ్డికి సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు పంపింది. తీవ్ర అనారోగ్యంతో జయలలిత గతేడాది సెప్టెంబరు 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. దాదాపు 75 రోజుల పాటు చికిత్స పొంది.. డిసెంబరు 5న కన్ను మూశారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో శశికళ కుటుంబ సభ్యులు మినహా ముఖ్యనేతలెవరినీ అనుమతించలేదు. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విచారణకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ను నియమించింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, దృశ్యాలు బయటకు రాలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఒకరోజు ముందు దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి దృశ్యాలు విడుదుల చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







