నదిలో పడిన బస్సు..26 మంది మృతి
- December 23, 2017
జైపూర్: బస్సు నదిలో పడి 26 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం సవాయ్ మాధోపూర్ లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. బస్సు వంతెన పైనుంచి పోతున్నప్పుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది దుర్మరణం చెందగా 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 2010, మార్చిలో సవాయ్ మాధోపూర్లోని మోరెల్ నదిలో బస్సు పడిపోవడంతో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!