ఘనంగా పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు
- December 23, 2017
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని జ్ఞానభూమి వద్ద పీవీకి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు. జూన్ 28, 1921న జన్మించిన పీవీ నరసింహారావు 2004, డిసెంబర్ 23న స్వర్గస్తులైనారు. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ.. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. కేంద్ర రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని.. ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన గొప్ప వ్యక్తి పీవీ.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల