ఘనంగా పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు
- December 23, 2017
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని జ్ఞానభూమి వద్ద పీవీకి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు. జూన్ 28, 1921న జన్మించిన పీవీ నరసింహారావు 2004, డిసెంబర్ 23న స్వర్గస్తులైనారు. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ.. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. కేంద్ర రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని.. ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన గొప్ప వ్యక్తి పీవీ.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







