దుబాయి: 65,000 దిర్హం లను స్వాహా చేసిన వేలెట్ పార్కింగ్ సిబ్బంది

- November 18, 2015 , by Maagulf
దుబాయి: 65,000 దిర్హం లను స్వాహా చేసిన వేలెట్ పార్కింగ్ సిబ్బంది

దుబాయి వేలెట్ పార్కింగ్ సిబ్బంది ఒకే కార్డును అనేకసార్లు ఉపయోగించి 65,000 దిర్హం లను కాజేశారు. దుబాయి పొలిసు శాఖ వారి జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ హెడ్ అహ్మద్ మాతర్ అల్ ముహైరీ , సులభంగా చేరిపివేయగల ఒక ప్రత్యేక తరహా పెన్ ను ఉపయోగించి కారు నెంబర్లను రాసి, మరల చెరిపివేసి కొత్త నెంబర్లను  రాస్తూ వేలేట్ పార్కింగ్ కంపెనీ నుండి 65,000 దిర్హం లను కాజేసినట్టు తెలియజేసారు. కాజేసిన సొమ్మును పంచుకోవడంలో గొడవపడి, వారిలో ఒకరు కంపెనీ యజమానికి ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలి, పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసారు. ప్రధాన నిందితుడు, నేరం చేసినట్టు నిరాకరించినప్పటికీ, ఒకే కార్డుపై అనేక సార్లు చేతిరాతతో నెంబర్లు రాసినట్టు ఫోర్జరీ సెక్షన్ వారు ధ్రువీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com