నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ మండిపాటు
- December 23, 2017
రోజూ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏదో ఒక మాట అనడానికి అని రోజా ఎదురు చూస్తుంటుందని, సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలవడం ఆమెకి అలవాటని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పనిలో పనిగా నాగబాబుపై కూడా ఫైర్ అవుతున్నారు. ఓ ప్రముఖ ఛానెల్లో వస్తున్న జబర్థస్త్ షోలో రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా నాగబాబు షో నుంచి తప్పుకోవట్లేదని అంటున్నారు. ఇంతకు ముందులాగానే రోజాతో కలిసి షో చేస్తుడడంతో అభిమానులు తట్టుకోలేపోతున్నారు. అయితే నాగబాబు మాత్రం రోజా రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసిందే కాని.. వ్యక్తిగతంగా మామధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ..అలాగని సాన్నిహిత్యం కూడా లేదన్నారు.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







