ఎపిలో ఉగాదే నూతన సంవత్సరం
- December 23, 2017
విజయవాడ: ఆలయాల్లో నూతన సంవత్సరం అలంకరణలను, వేడుకలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిషేధించింది. నూతన సంవత్సరం దర్శనాలపై కూడా నిషేధం పెట్టింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ అయింది.
దాంతో 2018 జనవరి 1వ తేదీన ఆలయాల్లో నూతన సంవత్సరం ప్రత్యేకతలు ఏవీ అమలు కావు. ఉగాదిని నూతన సంవత్సరంగా పరిగణించాలని, ఇంగ్లీష్ క్యాలెండర్ల స్థానంలో తెలుగు సంవత్సరాల క్యాలెండర్ను పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇంతకు ముందు జనవరి 1వ తేదీన ఆలయాల్లో పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇక అవి జరగవు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ను పాటిస్తూ వస్తున్నారని దేవాదాయ సాఖ హిందు ధర్మ ప్రచార ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అన్నారు.
నూతన సంవత్సర వేడుకలు హిందూ వైదిక సంస్కృతి కాదని అన్నారు. నూతన సంవత్సరాదిన వేలాది మంది భక్తులు వస్తుండడంతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తూ వచ్చారు. ఆ సంప్రదాయానికి అంతం పలకాలని కమిషన్ వైవి అనురాధ అంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







