ఎపిలో ఉగాదే నూతన సంవత్సరం
- December 23, 2017
విజయవాడ: ఆలయాల్లో నూతన సంవత్సరం అలంకరణలను, వేడుకలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిషేధించింది. నూతన సంవత్సరం దర్శనాలపై కూడా నిషేధం పెట్టింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ అయింది.
దాంతో 2018 జనవరి 1వ తేదీన ఆలయాల్లో నూతన సంవత్సరం ప్రత్యేకతలు ఏవీ అమలు కావు. ఉగాదిని నూతన సంవత్సరంగా పరిగణించాలని, ఇంగ్లీష్ క్యాలెండర్ల స్థానంలో తెలుగు సంవత్సరాల క్యాలెండర్ను పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇంతకు ముందు జనవరి 1వ తేదీన ఆలయాల్లో పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇక అవి జరగవు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ను పాటిస్తూ వస్తున్నారని దేవాదాయ సాఖ హిందు ధర్మ ప్రచార ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అన్నారు.
నూతన సంవత్సర వేడుకలు హిందూ వైదిక సంస్కృతి కాదని అన్నారు. నూతన సంవత్సరాదిన వేలాది మంది భక్తులు వస్తుండడంతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తూ వచ్చారు. ఆ సంప్రదాయానికి అంతం పలకాలని కమిషన్ వైవి అనురాధ అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల