స్వచ్ఛంద సంస్థ చిన్నారులతో చరణ్ ఉపాసన ల క్రిస్మస్ వేడుక..!!
- December 23, 2017
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా వెండి తెరపై హీరోగా రామ్ చరణ్ చిరుత సినిమాతో అడుగు పెట్టాడు.. తండ్రి వారసత్వం ఒక్క నటనలోనే కాదు.. మంచితనం.. మానవత్వం అని కూడా చరణ్ తన ప్రతి పనిలోనూ చూపిస్తున్నాడు. మెగా అభిమానులతో తండ్రి చిరంజీవి ఏ విధంగా సమావేశం నిర్వహిస్తూ.. వారు ఆపదలో ఉన్న సమయంలో ఆదుకొనే వాడో.. అదే ఆనవాయితీ చరణ్, అర్జున్ లు కొనసాగిస్తూనే ఉన్నారు.. ఇక రామ్ చరణ్ ఎవరు సహాయం అడిగినా కాదనకుండా చేస్తారు అని ఇండస్ట్రీ టాక్.. అంతేకాదు.. భార్య ఉపాసన తో కలిసి దసరా సమయంలో ఛారిటీ ట్రస్ట్ కు వెళ్ళి.. అక్కడ చిన్నారులతో బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు.. కాగా తాజాగా క్రిస్మస్ వేడుకలను పురష్కరించుకొని చరణ్, ఉపాసన దంపతులు సీక్రెట్ శాంతా వేడుకలో పాల్గొన్నారు. ఈ దంపతులు అక్షయ-ఆకృతి ఛారిటీ వద్దకు వెళ్లి.. సందడి చేశారు.. అక్కడ ఉన్న పిల్లలతో కలిసి రామ్ చరణ్ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు.. వారితో ఆడిపాడాడు.. ఈ వీడియోను ఉపాసన తన ఫేస్ బుక్ లో షేర్ చేయగా..మెగా అభిమానుల షెర్స్ తో హల్ చల్ చేస్తోంది. ఉపాసన ఈ వీడియో ను షేర్ చేస్తూ... చిన్నారులు మా పై అమితమైన ప్రేమ, అప్యాయతను చూపించడం చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ సి(చెర్రీ) అటాచ్ మెంట్ ఇంతలా ఎందుకు కుదిరిందో త్వరలో మీకు తెలుస్తుంది అంటూ ఆ వీడియోకి ఓ ట్వీట్ ని కూడా జతచేసింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







