బీహారీ దొంగను పట్టిచ్చిన నయనతార

- December 23, 2017 , by Maagulf
బీహారీ దొంగను పట్టిచ్చిన నయనతార

బీహార్‌లో ఓ నేరస్తుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన నాయకుడుకి చెందిన సంజయ్ కుమార్ సెల్‌ఫోన్‌ను మహ్మద్ హసైన్ దొంగిలించాడు. సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పట్టుకునేందుకు పథకం వేశారు. అందులో సీనియర్ అధికారిణి మధుబాలా దేవి అతని కాల్ డేటా రికార్డును ట్రేస్ చేశారు. ఓ ప్రేమికురాలిగా నటిస్తూ అతడికి సందేశాలు పంపించారు. మొదట మహ్మద్ స్పందించలేదు. కానీ అటు పక్క ఉన్న మధు మధురంగా మాటల్లో దింపేసరికి ముగ్గులో పడిపోయాడు. 

స్పందించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోను పంపించాలని అడిగాడు. ఆ సమయం కోసమే వేచి చూస్తున్న మధుబాల సినీ నటి నయన తార ఫొటోలను పంపించారు. ఎగిరి గంతేసిన దొంగ తనని కలుసుకాలని ఉందంటూ ఓ మంచి రోజుని ఫిక్స్ చేశాడు... ఇంకేముంది ఆరోజు రానేవచ్చింది. పోలీసు అధికారులు సాధారణ వ్యక్తుల్లా దుస్తులు ధరించి మహ్మద్ రమ్మన్న ప్రదేశానికి చేరుకున్నారు. ముసుగు ధరించి వెళ్లిన మధుబాలా దేవి మహ్మద్‌ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మధుబాల దొంగను పట్టుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com