బీహారీ దొంగను పట్టిచ్చిన నయనతార
- December 23, 2017
బీహార్లో ఓ నేరస్తుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన నాయకుడుకి చెందిన సంజయ్ కుమార్ సెల్ఫోన్ను మహ్మద్ హసైన్ దొంగిలించాడు. సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పట్టుకునేందుకు పథకం వేశారు. అందులో సీనియర్ అధికారిణి మధుబాలా దేవి అతని కాల్ డేటా రికార్డును ట్రేస్ చేశారు. ఓ ప్రేమికురాలిగా నటిస్తూ అతడికి సందేశాలు పంపించారు. మొదట మహ్మద్ స్పందించలేదు. కానీ అటు పక్క ఉన్న మధు మధురంగా మాటల్లో దింపేసరికి ముగ్గులో పడిపోయాడు.
స్పందించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోను పంపించాలని అడిగాడు. ఆ సమయం కోసమే వేచి చూస్తున్న మధుబాల సినీ నటి నయన తార ఫొటోలను పంపించారు. ఎగిరి గంతేసిన దొంగ తనని కలుసుకాలని ఉందంటూ ఓ మంచి రోజుని ఫిక్స్ చేశాడు... ఇంకేముంది ఆరోజు రానేవచ్చింది. పోలీసు అధికారులు సాధారణ వ్యక్తుల్లా దుస్తులు ధరించి మహ్మద్ రమ్మన్న ప్రదేశానికి చేరుకున్నారు. ముసుగు ధరించి వెళ్లిన మధుబాలా దేవి మహ్మద్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మధుబాల దొంగను పట్టుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల