బీహారీ దొంగను పట్టిచ్చిన నయనతార
- December 23, 2017
బీహార్లో ఓ నేరస్తుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన నాయకుడుకి చెందిన సంజయ్ కుమార్ సెల్ఫోన్ను మహ్మద్ హసైన్ దొంగిలించాడు. సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పట్టుకునేందుకు పథకం వేశారు. అందులో సీనియర్ అధికారిణి మధుబాలా దేవి అతని కాల్ డేటా రికార్డును ట్రేస్ చేశారు. ఓ ప్రేమికురాలిగా నటిస్తూ అతడికి సందేశాలు పంపించారు. మొదట మహ్మద్ స్పందించలేదు. కానీ అటు పక్క ఉన్న మధు మధురంగా మాటల్లో దింపేసరికి ముగ్గులో పడిపోయాడు.
స్పందించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోను పంపించాలని అడిగాడు. ఆ సమయం కోసమే వేచి చూస్తున్న మధుబాల సినీ నటి నయన తార ఫొటోలను పంపించారు. ఎగిరి గంతేసిన దొంగ తనని కలుసుకాలని ఉందంటూ ఓ మంచి రోజుని ఫిక్స్ చేశాడు... ఇంకేముంది ఆరోజు రానేవచ్చింది. పోలీసు అధికారులు సాధారణ వ్యక్తుల్లా దుస్తులు ధరించి మహ్మద్ రమ్మన్న ప్రదేశానికి చేరుకున్నారు. ముసుగు ధరించి వెళ్లిన మధుబాలా దేవి మహ్మద్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మధుబాల దొంగను పట్టుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







