బీహారీ దొంగను పట్టిచ్చిన నయనతార
- December 23, 2017
బీహార్లో ఓ నేరస్తుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన నాయకుడుకి చెందిన సంజయ్ కుమార్ సెల్ఫోన్ను మహ్మద్ హసైన్ దొంగిలించాడు. సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పట్టుకునేందుకు పథకం వేశారు. అందులో సీనియర్ అధికారిణి మధుబాలా దేవి అతని కాల్ డేటా రికార్డును ట్రేస్ చేశారు. ఓ ప్రేమికురాలిగా నటిస్తూ అతడికి సందేశాలు పంపించారు. మొదట మహ్మద్ స్పందించలేదు. కానీ అటు పక్క ఉన్న మధు మధురంగా మాటల్లో దింపేసరికి ముగ్గులో పడిపోయాడు.
స్పందించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోను పంపించాలని అడిగాడు. ఆ సమయం కోసమే వేచి చూస్తున్న మధుబాల సినీ నటి నయన తార ఫొటోలను పంపించారు. ఎగిరి గంతేసిన దొంగ తనని కలుసుకాలని ఉందంటూ ఓ మంచి రోజుని ఫిక్స్ చేశాడు... ఇంకేముంది ఆరోజు రానేవచ్చింది. పోలీసు అధికారులు సాధారణ వ్యక్తుల్లా దుస్తులు ధరించి మహ్మద్ రమ్మన్న ప్రదేశానికి చేరుకున్నారు. ముసుగు ధరించి వెళ్లిన మధుబాలా దేవి మహ్మద్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మధుబాల దొంగను పట్టుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







