ఖతార్లో బహ్రెయినీ సెయిలర్ అరెస్ట్
- December 23, 2017
మనామా: బహ్రెయినీ సెయిలర్ మరో ఇద్దరు ఖతారీ అథారిటీస్ స్వాధీనంలో ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి ప్రవేశించినట్లుగా ఆరోపిస్తోన్న ఖతార్, ఈ అరెస్టుల్ని ధృవీకరించింది. బహ్రెయిన్కి చెందిన 30 ఏళ్ళ ముస్తఫా హసన్, మరో ఇద్దరు బోటులో చేపలు పడుతుండగా, వారి బోట్లో ఫ్యూయల్ అయిపోవడంతో అనుకోకుండా ఖతార్ జలాల్లోకి ప్రవేశించారు. వీరిని నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఖతారీ కోస్ట్గార్డ్ టీమ్ అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. చేపలు పట్టేందుకోసం గత వారంలో వీరు బహ్రెయిన్లోని కోస్టల్ విలేజ్ ఆఫ్ అల్ దైర్ నుంచి వెళ్ళినట్లుగా బాధితుల బంధువులు పేర్కొన్నారు. మిగతా ఇద్దరు వ్యక్తుల్ని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు. ఖతారీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు అరెస్ట్ అయినవారిని ప్రవేశపెట్టి, అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగినట్లు సమాచారమ్.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!