రాష్ట్ర టెన్నిస్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
- December 23, 2017
విజయవాడ: స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గోల్డ్ స్లామ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి టెన్నిస్ ర్యాంకింగ్ చాంపియన్షిప్ను శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ టెన్నిస్ స్టేడియంలో క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ పోటీలు క్రీడాకారులకు మంచి సదావకాశమన్నారు. ప్రభుత్వం నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు, గోల్డ్స్లామ్ స్పోర్ట్స్ ఎండీ తిరుమల రాజు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







