రాష్ట్ర టెన్నిస్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
- December 23, 2017
విజయవాడ: స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గోల్డ్ స్లామ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి టెన్నిస్ ర్యాంకింగ్ చాంపియన్షిప్ను శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ టెన్నిస్ స్టేడియంలో క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ పోటీలు క్రీడాకారులకు మంచి సదావకాశమన్నారు. ప్రభుత్వం నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు, గోల్డ్స్లామ్ స్పోర్ట్స్ ఎండీ తిరుమల రాజు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







