రాష్ట్ర టెన్నిస్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
- December 23, 2017
విజయవాడ: స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గోల్డ్ స్లామ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి టెన్నిస్ ర్యాంకింగ్ చాంపియన్షిప్ను శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ టెన్నిస్ స్టేడియంలో క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ పోటీలు క్రీడాకారులకు మంచి సదావకాశమన్నారు. ప్రభుత్వం నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు, గోల్డ్స్లామ్ స్పోర్ట్స్ ఎండీ తిరుమల రాజు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







