న్యూజిలాండ్‌ కార్ ప్రమాదంలో హైదరాబాదీ మృతి

- December 24, 2017 , by Maagulf
న్యూజిలాండ్‌ కార్ ప్రమాదంలో  హైదరాబాదీ మృతి

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సయీద్ ఫర్హాద్ మహమూద్ అనే 29 ఏళ్ళ యువకుడు దుర్మరణం చెందాడు. క్యాబ్ డ్రైవరుగా పని చేస్తున్న సయీద్ వాహనాన్ని మరో కారు అతి పక్కనుంచి ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాదానికి కారణమైన కారులోని ఇద్దరు వ్యక్తులూ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. వారు కారును వదిలి పరారయ్యారు. అయితే వీరిలో ఒకరిని పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఫర్హాద్ మృతితో న్యూజిలాండ్ లో అతని భార్య, ఆరు నెలల వయసున్న కుమారుడు దిక్కులేనివారయ్యారు. ఫర్హాద్ మృత దేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు సహకరించాలని అతని కుటుంబం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com