మోడీకి ఎయిమ్స్ వైద్యుల లేఖ
- December 24, 2017
జయపుర: జీతాలు పెంచాలంటూ కొద్దిరోజులుగా రాజస్థాన్కి చెందిన ప్రభుత్వ వైద్యులు ఆందోళన చేపడుతున్నారు. దీనిపై ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్జీత్ సింగ్ ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు.
మీలాంటి ప్రధాని మాకు ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం. ఓ ప్రభుత్వ వైద్యుడి బాధలు మీకు తెలియాలంటే తెలుపు రంగు ఆప్రాన్ వేసుకుని ఒకరోజు ప్రభుత్వ వైద్యుడిగా వ్యవహరించండి. అప్పుడు మీకు తెలుస్తుంది అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబీకులు మాతో ఎలా ప్రవర్తిస్తారో. ప్రచారం కోసం ఇలాంటి ఆందోళనలు చేస్తున్నామని ఆరోపించే మంత్రులకు కూడా మా బాధలేంటో తెలిసొస్తాయి. మీరు ఒక్కరోజు ప్రభుత్వ వైద్యుడిగా మారితే విద్యావ్యవస్థలో మార్పు, ప్రజలకు నమ్మకం కలుగుతుంది అని లేఖలో పేర్కొన్నారు.
జీతాలు పెంచాలంటూ రాజస్థాన్లో వైద్యులు డిసెంబర్ 16 నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న వైద్యులపై ప్రభుత్వం రెస్మా చట్టం ప్రయోగించి 86 మంది వైద్యులను అరెస్టు చేయించిందని లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







