మోడీకి ఎయిమ్స్‌ వైద్యుల లేఖ

- December 24, 2017 , by Maagulf
మోడీకి ఎయిమ్స్‌ వైద్యుల లేఖ

జయపుర: జీతాలు పెంచాలంటూ కొద్దిరోజులుగా రాజస్థాన్‌కి చెందిన ప్రభుత్వ వైద్యులు ఆందోళన చేపడుతున్నారు. దీనిపై ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హర్జీత్‌ సింగ్‌ ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు.
మీలాంటి ప్రధాని మాకు ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం. ఓ ప్రభుత్వ వైద్యుడి బాధలు మీకు తెలియాలంటే తెలుపు రంగు ఆప్రాన్‌ వేసుకుని ఒకరోజు ప్రభుత్వ వైద్యుడిగా వ్యవహరించండి. అప్పుడు మీకు తెలుస్తుంది అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబీకులు మాతో ఎలా ప్రవర్తిస్తారో. ప్రచారం కోసం ఇలాంటి ఆందోళనలు చేస్తున్నామని ఆరోపించే మంత్రులకు కూడా మా బాధలేంటో తెలిసొస్తాయి. మీరు ఒక్కరోజు ప్రభుత్వ వైద్యుడిగా మారితే విద్యావ్యవస్థలో మార్పు, ప్రజలకు నమ్మకం కలుగుతుంది అని లేఖలో పేర్కొన్నారు. 

జీతాలు పెంచాలంటూ రాజస్థాన్‌లో వైద్యులు డిసెంబర్‌ 16 నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న వైద్యులపై ప్రభుత్వం రెస్మా చట్టం ప్రయోగించి 86 మంది వైద్యులను అరెస్టు చేయించిందని లేఖలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com